మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
- కిన్నెరమెట్ల మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్ లో ఇంటి స్థలం కేటాయించడంపై విమర్శ
- బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ లో స్థలం ఇవ్వాలని డిమాండ్
- ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మొగిలయ్య
శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల నగదును ప్రకటించింది. దీంతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. మొగిలయ్యకు రూ. కోటి నగదు, ఆయన కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.