విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోంది: మంత్రి అమర్నాథ్
- మరోసారి తీవ్ర చర్చకు దారితీసిన ఏపీ రాజధాని అంశం
- విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్
- హాజరైన ఏపీ మంత్రులు, పలు దేశాల ప్రతినిధులు
- వేగంగా ఎదుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటన్న అమర్నాథ్
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, విశాఖ ఏపీకి కొత్త రాజధాని కాబోతోందని తెలిపారు. త్వరలో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.