టర్కీ, సిరియాలో 41 వేలు దాటిన మరణాలు.. వారం తర్వాత కూడా శిథిలాల కింద కొందరు సజీవం
- వారం కిందట ఇరు దేశాల్లో భారీ భూకంపాలు
- గుట్టలుగా బయట పడుతున్న మృతదేహాలు
- సహాయ చర్యల్లో ప్రాణాలతో బయటపడుతున్న పలువురు
అంటాక్యాలో సిరియన్ యువకుడు, యువతిని శిథిలాల నుంచి 200 గంటల తర్వాత రక్షించారు. భూకంపం సంభవించిన 212 గంటల తర్వాత టర్కీలోని అడియామాన్లో శిథిలాల నుంచి 77 ఏళ్ల వృద్ధుడితో పాటు 18 ఏళ్ల యువకుడిని బయటకు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దాంతో, శిథిలాల కింద ఇంకా చాలా మంది సజీవంగా ఉండవచ్చని సహాయ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు భూకంపం తర్వాత ఇరు దేశాల్లో చాలా మంది నిరాశ్రయులయ్యారు. తీవ్రమైన చలిలో ఆశ్రయం, ఆహారం కోసం పోరాడుతున్న ప్రజలకు సహాయం చేయడంపై టర్కీ, సిరియా ప్రభుత్వాలు ఇప్పుడు దృష్టి సారించాయి.