Graduate MLC: ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు

  • మార్చి 29తో ముగియనున్న ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం
  • ఇటీవల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
  • మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఏపీలో 3 పట్టభద్రులు, 9 స్థానిక సంస్థలు, 2 ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు
BJP announced candidates for Graduate MLC Elections in AP

తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు, 9 స్థానిక సంస్థల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఈ నేపథ్యంలో, ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. 

కడప-అనంతపురం-కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి నగరూరు రాఘవేంద్ర... ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి... శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానానికి పీవీఎన్ మాధవ్ ను బీజేపీ నాయకత్వం అభ్యర్థులుగా ఎంపిక చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుండడంతో, ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది.

More Telugu News