ఇండియాను ఇండియాలో ఓడించే సత్తా పాకిస్థాన్ కు మాత్రమే ఉందన్న ఆ దేశ ఫ్యాన్ కు ఆకాశ్ చోప్రా చురక
- సొంత గడ్డపై వరుస విజయాలను సాధిస్తున్న టీమిండియా
- ఇండియాను ఓడించే సత్తా మాకే ఉందన్న పాక్ అభిమాని
- ముందు మీ సొంత గడ్డపై గెలవండి అంటూ ఆకాశ్ చోప్రా చురక
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇండియాను ఇండియాలో ఓడించే ఉత్తమ అవకాశం తడిగా ఉన్న తారాజువ్వలా మారితే ఎలా ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పాకిస్థాన్ కు చెందిన తల్లా హెజాజ్ అనే అభిమాని స్పందిస్తూ... భారత్ ను భారత్ లో ఓడించే సత్తా కేవలం పాకిస్థాన్ కు మాత్రమే ఉందని చెప్పారు. దీనికి సమాధానంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ... మీ ఆశాభావాన్ని ఇష్టపడుతున్నానని... అయితే, ముందు మీ గడ్డపై సిరీస్ లను గెలవండి అంటూ చురక అంటించాడు.