పుజారా విజయాలకు తగిన గుర్తింపు రాలేదు: సచిన్ టెండూల్కర్
- భారత్ సాధించిన విజయాల్లో అతడి సేవలు గొప్పవన్న సచిన్
- జట్టులోనూ అతడి ప్రాధాన్యతను సరిగ్గా గుర్తించినట్టు లేదన్న లెజెండరీ క్రికెటర్
- ఆస్ట్రేలియాతో సిరీస్ లో 100 టెస్టుల మైలురాయికి పుజారా

చటేశ్వర్ పుజారా చాలా విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. అంతేకాదు మొదటి టెస్ట్ తుది జట్టులోనూ భాగంగా ఉన్నాడు. అతడికి ఇది 99వ టెస్ట్ మ్యాచ్ కానుంది. ఈ సిరీస్ తో అతడు 100 టెస్ట్ ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఇక్కడే ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనిపై లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.