హైదరాబాద్లో భారీగా ‘థ్యాంక్యూ మోదీజీ’ హోర్డింగ్స్
- కేంద్ర బడ్జెట్ పై ధన్యవాదాలు చెబుతూ భారీ ఫ్లెక్సీలు
- డబుల్ బెడ్ రూం బాధితుల సంఘం, మిడిల్ క్లాస్ ప్రజల పేరిట ఏర్పాటు
- కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ. 79 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్ రూం బాధితుల సంఘం పేరిట మరో హోర్డింగ్ ఏర్పాటైంది. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రంలోని అధికార బీఆర్ ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ శ్రేణులు వీటిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.