Nara Lokesh: 100 కిమీ పూర్తిచేసుకున్న పాదయాత్ర... బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించిన లోకేశ్

  • జనవరి 27న లోకేశ్ పాదయాత్ర ప్రారంభం
  • 4 వేల కిమీ మేర కొనసాగనున్న పాదయాత్ర
  • తొలి మైలురాయి అందుకున్న వైనం
Lokesh Yuvagalam padayatra completes 100 km

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ ఘట్టానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా నిలిచింది. 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఘట్టంలో ఇది తొలి మైలురాయి కావడంతో, లోకేశ్ బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించారు. కాగా, యువగళం పాదయాత్ర బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా పోలీసులు... లోకేశ్ కాన్వాయ్ లోని 3 వాహనాలను సీజ్ చేశారు. లోకేశ్ బంగారుపాళ్యంలో ప్రవేశించిన సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

More Telugu News