పెళ్లి పీటలు ఎక్కుతున్న కియారా అద్వానీ.. పంజాబీ సంప్రదాయంలో వివాహం
- ఫిబ్రవరి 6న కియారా, సిద్ధార్థ్ ల పెళ్లి
- జైసల్మేర్ లోని ప్యాలస్ లో వివాహం
- ఢిల్లీ, ముంబైలలో రిసెప్షన్
ఇక ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నట్టు సమాచారం. రాజస్థానీ సంప్రదాయ వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు. పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లను ఏర్పాటు చేయనున్నారు. 'షేర్షా' సినిమాలో వీరిద్దరూ తొలిసారి నటించారు. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు.