పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్
- కేసీఆర్ వెళ్లగొడితే బీజేపీ తనను అక్కున చేర్చుకుందన్న ఈటల
- తానేదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే ఉంటానని స్పష్టీకరణ
- పార్టీ మార్పు వార్తలు కేసీఆర్ దుష్ప్రచారమని ఆరోపణ
ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయనే ఈ చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈటల అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.