హిండెన్బర్గ్ నివేదిక బోగస్: అదానీ గ్రూప్
- నివేదికలో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలన్న సీఎఫ్ఓ
- నివేదిక వెనుక పెద్ద కుట్ర ఉందని విమర్శ
- తమ వ్యాపారాల్లో ఎలాంటి తప్పిదం కనుగొనలేదని వెల్లడి
తప్పుడు ఆరోపణలతో తమ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి.. హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందని విమర్శించింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో జుగేష్ ఇందర్ సింగ్ హిండెన్ బర్గ్ పై విరుచుకుపడ్డారు. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ (ఎఫ్పీఓ) సమయంలో హిండెన్బర్గ్ ఈ నివేదిక విడుదల చేయడం పెద్ద కుట్ర అన్నారు.
‘హిండెన్బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఎప్పుడో సమాధానం ఇచ్చాయి. వీటిలో 68 ప్రశ్నలు బోగస్, తప్పుడువే. అబద్ధాలు,తప్పుడు సమాచారం ఆధారంగా తయారు చేసిన ఈ బూటకపు నివేదిక కూడా మా వ్యాపారాలలో ఎలాంటి తప్పును కనుగొనలేకపోయింది. అది ఒక తప్పుడు మార్కెట్ను సృష్టించడం కోసం నిగూఢ ఉద్దేశ్యంతో నడుస్తున్న సంస్థ’ అని జుగేష్ ఇందర్ సింగ్ ఆరోపించారు.