కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది: బండి సంజయ్
- ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించిన తెలంగాణ సర్కారు
- తప్పులు సరిదిద్దాలంటూ బీజేవైఎం నేతల ఆందోళన
- పోలీసుల లాఠీచార్జి
- బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు భానుప్రకాశ్ కు గాయాలు!
- పోలీసులపై మండిపడిన బండి సంజయ్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ బీజేవైఎం నేతలు ఛలో డీజీపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోగా, బీజేవైఎం తెలంగాణ అధ్యక్షుడు భానుప్రకాశ్ సొమ్మసిల్లిపడిపోయారు. భానుప్రకాశ్ పై పోలీసులు లాఠీచార్జి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం భానుప్రకాశ్ హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భానుప్రకాశ్ ను బండి సంజయ్ ఫోన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.