Jagan: రాజ్ భవన్ లో ఎట్ హోం... సతీసమేతంగా హాజరైన సీఎం జగన్

  • నేడు రిపబ్లిక్ డే
  • రాజ్ భవన్ లో హై టీ కార్యక్రమం
  • హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
CM Jagan attends At Home in Raj Bhavan

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ అల్పాహార విందు కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రజాప్రతినిధులు, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎట్ హోమ్ కు హాజరైన అతిథులందరినీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుపేరునా పలకరించారు. అటు, గవర్నర్ అర్ధాంగితో సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి ఉల్లాసంగా కబుర్లు చెబుతూ కనిపించారు. 

More Telugu News