Nara Lokesh: జగన్ పాలనలో సీఐడీ నేర భాగస్వామ్య వ్యవస్థగా మారింది: లోకేశ్

Lokesh take swipe at YCP govt
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. జగన్ పాలనలో సీఐడీ నేర భాగస్వామ్య వ్యవస్థగా మారిందని విమర్శించారు. సివిల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకు సీఐడీని అడ్డాగా మార్చారని ఆరోపించారు. సీఐడీ పేరు వింటేనే జనం ఛీకొట్టేలాగా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. 

విశాఖలో కల్లుగీత కార్మికుడ్ని ఎవరికోసం బెదిరించారని ప్రశ్నించారు. భూకబ్జాలకు సీఐడీని వాడడం సైకో పాలనలోనే చూస్తున్నామని లోకేశ్ విమర్శించారు. దసపల్లా భూములను కబ్జా చేసినవాళ్లను సీఐడీ పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
CID
AP Govt
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News