రేపు కొండగట్టుకు జనసేనాని.. టూర్ షెడ్యూల్ ఇదిగో!
- అంజన్న సన్నిధానంలో పార్టీ ప్రచార రథం ‘వారాహి’కి పూజ
- ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న పవన్ కల్యాణ్
- కొండగట్టులో పూజల అనంతరం కార్యకర్తలతో సమావేశం
- సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకోనున్న జనసేన చీఫ్
మంగళవారం ఉదయం 7 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు అంజన్న దర్శనం చేసుకుని, ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన వారితో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ను మొదలుపెడతారు. సాయంత్రం 5:30 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.