30 ఏళ్ల తర్వాత అందిన ఉత్తరం.. పంపినవారు.. అందుకోవాల్సిన వారు ఇద్దరూ మృతి!
- ఇంగ్లండ్లో ఘటన
- 1995లో రాసిన లేఖను తాజాగా డెలివరీ చేసిన పోస్టల్ శాఖ
- 1880ల నాటి కుటుంబ కథల గురించి లేఖలో వివరణ
- తొలుత దానిని క్రిస్మస్ కార్డు అనుకున్నానన్న లేఖ అందుకున్న వ్యక్తి
యూకేలోని నార్తంబర్ల్యాండ్కు చెందిన 60 ఏళ్ల జాన్ రెయిన్బోకు పోస్టల్ శాఖ తాజాగా ఓ లెటర్ అందించింది. అది చూసిన ఆయన షాకయ్యాడు. 1995లో పోస్టు చేసిన ఆ లెటర్ తాజాగా డెలివరీ కావడం మాత్రమే ఆయన షాక్కు కారణం కాదు.. ఆ ఇంట్లో ఇంతకుముందు నివసించిన వెలెరీ జార్విస్ రీడ్కు వచ్చిన ఉత్తరం అది.
పదవీ విరమణ అనంతరం రెయిన్బో 2015 నుంచి తన భార్యతో కలిసి వైలామ్లోని ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. ఆ లేఖలో 1880ల నాటి కుటుంబ కథల గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఉందని, తన పిల్లలు ఎలా పెరిగిందీ అందులో రాసుకొచ్చారని రెయిన్బో పేర్కొన్నారు.
నిజానికి తొలుత ఈ లేఖ గురించి తాను పట్టించుకోలేదన్నారు. దానిని క్రిస్మస్ కార్డు అనుకున్నానని, కానీ ఆ తర్వాత అది చాలా పాత ఉత్తరమని గుర్తించినట్టు చెప్పారు. చాలా ఆశ్చర్యకరంగా ఉందని, ఇక్కడ గతంలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని రెయిన్బో అన్నారు.