Chandrababu: కియా పరిశ్రమకు చంద్రబాబు అభినందన

  • ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును దక్కించుకున్న కియా
  • కియా కేరెన్స్ వేరియంట్ కు అవార్డు
  • చాలా సంతోషంగా ఉందన్న చంద్రబాబు
Chandrabu congratulates KIA Motors

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఏపీకి తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కియా కార్ల పరిశ్రమ ఒకటి. అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. తాజాగా 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023' అవార్డును కియా సొంతం చేసుకుంది. కియా కేరెన్స్ వేరియంట్ కు ఈ అవార్డు దక్కింది. 

ఈ సందర్భంగా కియా పరిశ్రమకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అనంతపురం ప్లాంటులో ఉత్పత్తి అవుతున్న కేరెన్స్ వేరియంట్ కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇది గర్వించదగ్గ తరుణమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కియా పరిశ్రమ ఫొటోలు, ట్రయల్ ప్రొడక్షన్ సెరెమొనీ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. 

More Telugu News