అదరగొట్టిన భారత అమ్మాయిలు.. ముక్కోణపు సిరీస్ లో శుభారంభం
- తొలి మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం
- రాణించిన అమన్ జోత్, దీప్తి శర్మ
- వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్
అయితే, దీప్తి శర్మ (23 బంతుల్లో 33), అమంజోత్ కౌర్ (30 బంతుల్లో 41) ఆరో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు మంచి స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. సున్ లూస్ (29), చ్లోయె ట్రైన్ (26), మరిజానె కాప్ (22) పోరాడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, దేవిక రెండు వికెట్లతో సత్తా చాటారు. అమన్ జోత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.