హాకీ వరల్డ్ కప్ లో వేల్స్ పై గెలిచినా భారత్ కు నిరాశే
- నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో 4-2 తేడాతో విజయం
- గ్రూప్–డి రెండో స్థానంతో నేరుగా క్వార్టర్స్ చేరలేకపోయిన ఆతిథ్య జట్టు
- ఆదివారం క్రాస్ ఓవర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న భారత్
భారత్కంటే ( 4) మెరుగైన గోల్స్ ( 9) భేదంతో ఆ జట్టు గ్రూప్ టాపర్గా క్వార్టర్స్ చేరింది. ఈ నేపథ్యంలో భారత జట్టు గ్రూప్లో అగ్రస్థానం చేజిక్కించుకోవాలంటే ఏడుకుపైగా గోల్స్ చేయాల్సి వచ్చింది. కానీ భారత్ నాలుగు గోల్స్కే పరిమితమైంది. క్వార్టర్ ఫైనల్లో స్థానం కోసం ఆదివారం జరిగే క్రాస్ఓవర్ మ్యాచ్లో న్యూజిలాండ్ తో భారత్ పోటీ పడుతుంది. అదేరోజు మలేసియాతో స్పెయిన్ తలపడుతుంది.