ఏపీ ప్రభుత్వ జీవో నెం.1పై రేపు సుప్రీంకోర్టులో విచారణ
- రోడ్లపై సభలు, ర్యాలీలపై జీవో తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- హైకోర్టును ఆశ్రయించిన సీపీఐ రామకృష్ణ
- ఈ నెల 23 వరకు జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
- సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏపీ సర్కారు అభ్యర్థనపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం... ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిపేందుకు నిర్ణయించింది. అటు, జీవో నెం.1పై ఏపీ హైకోర్టులో జనవరి 23న విచారణ జరగనుంది.