భోగి మంటలను బూటు కాళ్లతో ఆర్పేసిన ధర్మవరం పోలీసులు
- భోగి మంటలు వేసిన టీడీపీ శ్రేణులు
- జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసిన వైనం
- ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
మరోవైపు ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భోగి మంటలను తమ బూటు కాళ్లతో ఆర్పేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా 'సైకో పోవాలి... సైకిల్ రావాలి' అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. సంప్రదాయబద్ధమైన భోగి మంటలను బూటు కాళ్లతో ఆర్పడం దారుణమని విమర్శించారు.