ఈడెన్ గార్డెన్స్ లో ఇషాన్ కిషన్ తో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లీ.. వీడియో ఇదిగో!
- గురువారం రాత్రి శ్రీలంక, భారత్ మధ్య రెండో వన్డే
- మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో లేజర్ షో ఏర్పాటు
- పోటాపోటీగా స్టెప్పులు వేసిన కోహ్లీ, ఇషాన్
డగౌట్ దగ్గర ఇద్దరూ పోటాపోటీగా స్టేప్పులు వేయగా స్టాండ్స్ లోని ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ వాళ్లను ఉత్సాహపరిచారు. ఇద్దరి నృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి. కాగా, రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను భారత్ ఓడించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్ ను 2–0తో గెలిచింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.