Balakrishna: ఆ పాత్రను గోప్యంగా ఉంచమని చెప్పాను: 'వీర'మాస్ బ్లాక్ బస్టర్ మీట్ లో బాలకృష్ణ

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'వీరసింహారెడ్డి'
  • కొంతసేపటి క్రితం జరిగిన బ్లాక్ బస్టర్ ఈవెంట్ 
  • సమష్టి కృషి వల్లనే సక్సెస్ సాధ్యమైందన్న బాలయ్య 
  • తమన్, బుర్రా సాయిమాధవ్, రామ్ లక్ష్మణ్ లపై ప్రశంసలు
Veerasinha Redyy Veera Mass Blockbuster Meet

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'వీరసింహారెడ్డి' సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ 'వీరమాస్ బ్లాక్ బస్టర్ మీట్' పేరుతో ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై బాలయ్య మాట్లాడుతూ .. 'అఖండ' సినిమా తరువాత చేసే సినిమా, కనీసం దానికి దగ్గరలోకి వెళ్లేలా ఉండాలని అనుకున్నాను. ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందని భావించాను" అన్నారు.

"అలాంటి సమయంలోనే నాకు గోపీచంద్ మలినేని ఈ కథను వినిపించాడు. ఈ రోజున ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అందుకు ప్రేక్షక దేవుళ్లకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. దర్శకుడిగా గోపీచంద్ మలినేని తనకి కావలసిన అవుట్ పుట్ ను రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ .. తమన్ సాంగ్స్ .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి" అని చెప్పారు. 

"ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నాకు చెల్లెలి పాత్రను చేసింది. సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పాను. ఫస్టు టైమ్ తెరపై ఆ విషయం రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ థ్రిల్ కావాలనే ఉద్దేశంతో అలా చేశాము. నా 'భైరవద్వీపం' సినిమాలో 'కురూపి' లుక్ ను కూడా అలాగే గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ సినిమాలో చెల్లెలి పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా చేసింది. ఈ సంక్రాంతికి నా సినిమా విందుభోజనమైనందుకు సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News