‘జోషిమఠ్’పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ లో భూమి కుంగుబాటు
- జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్
- దాన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం
స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తరఫు న్యాయవాది పరమేశ్వర్ నాథ్ మిశ్రా ఈ కేసును అత్యవసర విచారణ కోసం ప్రస్తావించారు. దీనికి కోర్టు నిరాకరించింది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఈ విషయాలు చూసుకోగలవు అని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 16న దీన్ని విచారణకు తీసుకుంటామని చెప్పింది. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కారణంగా జోషిమఠ్లో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించాలని సరస్వతి తన పిటిషన్లో వాదించారు. ఈ కష్ట సమయంలో జోషిమఠ్ నివాసితులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి సాయం అందించాలని అభ్యర్థించారు.