జల్లికట్టు పోటీల్లో తొలిరోజే 20 మందికి గాయాలు
- గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమం
- తమిళనాడులోని పుదుకోట్టైలో ప్రారంభమైన పోటీలు
- మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్ హాజరు
జల్లికట్టు పేరుతో మూగజీవాలను హింసిస్తున్నారనే ఆరోపణలతో గతంలో ఈ ఆటపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ ఆటలో పాల్గొన్న వారిలో కొంతమంది చనిపోతుండగా.. చాలా మంది గాయపడుతున్నారు. దీంతో జల్లికట్టుపై నిషేధం విధించారు. అయితే, సుప్రీం కోర్టు దాక వెళ్లి జల్లికట్టు పోటీల నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం షరతులతో జల్లికట్టు నిర్వహణకు అనుమతిచ్చింది.