Botsa Satyanarayana: విమర్శలు చేసేముందు జీవోను క్షుణ్ణంగా చదవండి: బొత్స సత్యనారాయణ

  • జీవో నెంబర్ వన్ పై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు
  • అసలు జీవోను చదివారా? అని బొత్స ప్రశ్న
  • రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని వ్యాఖ్య
Read GO no 1 before commenting says Botsa Satyanarayana

రహదారులపై సభలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విమర్శలు చేసే ముందు జీవోను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. అసలు ఆ జీవోను ప్రతిపక్ష నేతలు చదివారా? అని ప్రశ్నించారు. 

రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఎక్కడుందో విమర్శకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని చెప్పారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని తెలిపారు. అవసరమైతే అనుమతి తీసుకుని బహిరంగసభలు పెట్టుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్, జగన్ చేపట్టిన పాదయాత్రల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల పట్ల అన్ని పార్టీలు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News