Nadendla Manohar: ఉత్తరాంధ్ర, రాయలసీమ డెవలప్ మెంట్ బోర్డులను ఏర్పాటు చేయాలి: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar demands to setup North Andhra development board
  • ఉత్తరాంధ్రను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న నాదెండ్ల  
  • మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని మండిపాటు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్య

ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ గడ్డను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని... ఈ ప్రాంత అభివృద్ధి కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని చెప్పారు. ఉత్తరాంధ్రలోని నిరుద్యోగులు కోచింగ్ ల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం అరకు డిక్లరేషన్ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News