భారత్ ను గెలిపించలేకపోయినా.. అరుదైన రికార్డు బ్రేక్ చేసిన అక్షర్ పటేల్
- 31 బంతుల్లోనే 65 పరుగులు చేసిన అక్షర్
- ఏడో నంబర్ లో వచ్చి ఎక్కువ రన్స్ చేసిన భారత క్రికెటర్ గా రికార్డు
- ఈ స్థానంలో ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడినూ ఘనత
ఈ మ్యాచ్ లో జట్టు ఓడినా తన పోరాటంతో అందరి మనసులు గెలిచిన అక్షర్ పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. టీ20 మ్యాచ్ లో ఏడో నంబర్ లో వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ఘనత సాధించాడు. 44 పరుగులతో ఉన్న రవీంద్ర జడేజాను వెనక్కు నెట్టాడు. అలాగే, ఏడు, ఆ తర్వాత నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ గా రికార్డు బద్దలు కొట్టాడు. ఇది వరకు 4 సిక్సర్లతో దినేశ్ కార్తీక్ పేరిట ఈ రికార్డు ఉంది. ఇక, ఈ మ్యాచ్ లో అక్షర్ 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఫార్మాట్ లో ఇది ఐదో వేగవంతమైన అర్ధ శతకం కావడం విశేషం.