Balakrishna: ఒంగోలు వేదికపై 'వీరసింహారెడ్డి' ట్రైలర్ రిలీజ్ .. ముహూర్తం ఖరారు!

  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'వీరసింహారెడ్డి'
  • రేపు రాత్రి ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • భారీస్థాయిలో తరలిరానున్న అభిమానులు 
  • ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
Veerasimha Reddy Trailer Release Date Confirmed

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఈ నెల 6వ తేదీన 'ఒంగోలు'లో ప్లాన్ చేశారు. 

అభిమానుల సమక్షంలో భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేదిక పై నుంచి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆ రోజున రాత్రి 8:17 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ ఉంటుందని చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

కొంతమంది శత్రువులను మట్టి కరిపించి, మిగిలినవారి అంతుచూడటం కోసం ఆవేశంతో దూకుడుగా వస్తున్న 'వీరసింహారెడ్డి'ని ఈ పోస్టర్లో చూడొచ్చు. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది.

More Telugu News