సోనియాగాంధీకి అస్వస్థత.. గంగారామ్ ఆసుపత్రికి తరలింపు
- శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న సోనియా
- నిన్నటి నుంచి బాగోలేని ఆరోగ్యం
- త్వరగా కోలుకోవాలన్న సిద్ధరామయ్య
ఇంకోవైపు నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించింది. తమ తల్లికి ఆరోగ్యం బాగోలేదనే విషయం తెలిసిన వెంటనే రాహుల్, ప్రియాంక ఢిల్లీకి వచ్చారు. సోనియా అనారోగ్యంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ... ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోనియా అనారోగ్యంపాలయ్యారనే వార్తను వినడం బాధాకరమని చెప్పారు.