పంత్ మెదడు, వెన్నెముక నార్మల్.. ఎంఆర్ఐ స్కానింగ్ లో వెల్లడి
- రూర్కీ సమీపంలో కారు ప్రమాదంలో రిషబ్ కు గాయాలు
- ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స
- ముఖానికి అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు
పంత్ తన లగ్జరీ కారులో ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పంత్ కారు డివైడర్ను ఢీకొన్న కొద్ది నిమిషాలకే మంటలు చెలరేగాయి. ఓ బస్ డ్రైవర్ అతడిని కాపాడి ఆసుపత్రిలో చేర్చాడు. ఇక, శుక్రవారం రాత్రి ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతను పూర్తి స్పృహలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.