తలుపులు, గోడలు లేకుండానే మరుగుదొడ్లు.. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం
- ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఘటన
- నాలుగు టాయిలెట్లను ఒకదాని పక్కన మరోటి కట్టేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ధన్సా గ్రామంలోని రుధౌలి బ్లాక్లో నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో నిబంధనలు పాటించలేదని అభివృద్ధి విభాగం ముఖ్య అధికారి రాజేశ్ ప్రజాపతి తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారుల దర్యాప్తు నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టాయిలెట్లు నిర్మించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.