TTD: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు

  • టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
  • ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య 2.35 కోట్లు
  • 11.42 కోట్ల లడ్డూల విక్రయం
TTD releases white paper on assets

కరోనా ప్రభావం వల్ల 2020, 2021లో తిరుమల క్షేత్రంలో తీవ్ర ఆంక్షల వల్ల భక్తులు పెద్దగా రాలేకపోయారు. 2022లో ఆ పరిస్థితి లేదు. ఆంక్షల ఎత్తివేతతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి హుండీ కూడా అదే స్థాయిలో కళకళలాడింది. ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. 

ఈ సంవత్సరం ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని... 1.08 కోట్ల మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని... 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ వివరించింది.

More Telugu News