యూఏఈలో ఉద్యోగులకు ఏడాది పాటు పెయిడ్ లీవ్.. ఎందుకంటే..!
- ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
- వ్యాపారం ప్రారంభించేందుకు ఏడాది పాటు సగం జీతంతో సెలవు
- ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
అంతేకాదు.. సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం కూడా ఇస్తామని యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సెలవును వినియోగించుకోవాలని భావించే ఉద్యోగి వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.