దర్యాప్తు సంస్థలను ఈ రెండు పార్టీలు వాడుకుంటున్నాయి: రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ, బీఆర్ఎస్ లను బాధితులుగానే చూపిస్తున్నారన్న రేవంత్
- దోషి ఎవరనే విషయం తేలాల్సి ఉందని వ్యాఖ్య
- కేసులో ఉన్న ఎమ్మెల్యేలలో నలుగురు పార్టీ మారినవారేనని విమర్శ
ఈ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు పార్టీ మారినవారేనని రేవంత్ విమర్శించారు. పార్టీ మారినందుకు బీఆర్ఎస్ లో వీరికి మంచి పదవులు ఇచ్చారని అన్నారు. ఇది కూడా అవినీతేనని ఆరోపించారు. 2018లో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా విచారించాలని సీబీఐని కోరుతామని చెప్పారు.