న్యూ ఇయర్ వేడుకల కోసం అజ్ఞాత ప్రదేశానికి విరాట్ కోహ్లీ, అనుష్క

Virat Kohli and Anushka Sharma jet off to an undisclosed location for New Year celebrations
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరారు. ఈ జంట బుధవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ప్రత్యేక విమానంలో ఈ జంట ప్రయాణం చేసింది. అయితే, వీరు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారో తెలియరాలేదు. ఎయిర్ పోర్టు ముంగిట మాత్రం ఈ ఇద్దరూ ఫొటోలకు పోజులు ఇస్తూ ఉత్సాహంగా కనిపించారు. 

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ముగించుకున్న తర్వాత భారత జట్టుతో కలిసి కోహ్లీ మంగళవారమే స్వదేశానికి చేరుకున్నాడు. జనవరి 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయాన్ని కుటుంబంతో వెచ్చించేందుకు అతను విదేశీ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’ ఇటీవలే పూర్తయింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో అనుష్క.. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి పాత్రలో కనిపించనుంది.
Go Back to Shorts
Team India
Cricket
Virat Kohli
Anushka Sharma

More Telugu News