పాన్-ఆధార్ అనుసంధానానికి మరో మూడు నెలలే
- ప్రతి ఒక్కరూ మార్చి 31లోపు లింక్ చేసుకోవాలి
- లేదంటే పాన్ పని చేయదన్న ఆదాయపన్ను శాఖ
- పాన్ పని చేయకపోతే రిటర్నులు వేయడం, రిఫండ్ కోరడం కుదరదు
మినహాయింపు విభాగంలోని వారు అంటే.. అసోం, జమ్మూ అండ్ కశ్మీర్, మేఘాలయ, ఎన్ఆర్ఐలు, 80 ఏళ్లు నిండిన పెద్దలు అని అర్థం చేసుకోవాలి. మిగిలిన అందరూ తమ పాన్ ను ఆధార్ తో అనుసంధానించుకోవాల్సిందే. పాన్ పని చేయకుండా పోతే, తదుపరి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం, రిఫండ్ లు కోరడం సాధ్యపడదు. పెట్టుబడులకు ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంకు లావాదేవీలకు సైతం సమస్యలు ఎదురవుతాయి. కనుక వెంటనే లింక్ చేసుకోవడమే ఉత్తమం.