Balakrishna: ఇప్పుడు మీరు చూసిన బాలయ్య సాంగ్ శాంపిల్ మాత్రమే: గోపీచంద్ మలినేని

  • గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న 'వీరసింహారెడ్డి'
  • బాలకృష్ణ సరసన అలరించనున్న శ్రుతి హాసన్ 
  • కొంతసేపటి క్రితం మరో సాంగ్ రిలీజ్
  • ఫ్యాన్స్ కి పండగేనని దర్శకుడి వ్యాఖ్య  
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల 
Veera Simha Reddy song launch event

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు గోపీచంద్ మలినేని 'వీరసింహారెడ్డి' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలు మాస్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'మా బావ మనోభావాలు' అనే పాటను రిలీజ్ చేశారు. 

ఈ సాంగ్ లాంచ్ ఈవెంటులో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. "జనవరి 12 నుంచి మామూలుగా ఉండదు. అన్ని థియేటర్స్ లో 'జై బాలయ్య' నినాదం మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఈ సాంగ్ లో సిగరెట్ స్టెప్ ఒకటి .. సోడా స్టెప్ ఒకటి ఉంటాయి. ఆ స్టెప్స్ మామూలుగా ఉండవు. 

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఒక పాట షూటింగు జరుగుతోంది. ఆ పాట గురించి చెప్పాలంటే ఫ్యాన్స్ కి ఇక పండగే. నాకు తెలిసి థియేటర్స్ లో ఎవరూ సీట్లలో కూర్చోరు. అంత బీభత్సంగా ఉంటుంది. జనవరి 12న వస్తున్నాం .. రెడీగా ఉండండి" అంటూ చెప్పుకొచ్చాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

More Telugu News