లాటరీలో రూ. 30 కోట్లు గెలుచుకున్న దుబాయ్ లోని తెలంగాణ యువకుడు
- దుబాయ్ లో డ్రైవర్ గా పని చేస్తున్న అజయ్
- 30 దిర్హాములతో రెండు లాటరీ టికెట్లు కొన్న వైనం
- నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన అజయ్
అజయ్ ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి కూడా మరణించడంతో తల్లే పెంచింది. నాలుగేళ్ల క్రితం ఉపాధికోసం ఈ యువకుడు దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో డ్రైవర్ గా పనికి కుదిరాడు. ఈ క్రమంలో 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఇందులో ఒక టికెట్ కు రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. తనకు లాటరీ తగలడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.