అమ్మాయిలు దొరకడం లేదని ఆవేదన.. పెళ్లి కాని ప్రసాదుల వినూత్న నిరసన!
- మహారాష్ట్రలోని సోలాపూర్లో ఘటన
- గుర్రాలపై పెళ్లికొడుకుల్లా వచ్చిన యువకులు
- సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
- రాష్ట్రంలో లింగనిష్పత్తి దారుణంగా పడిపోయిందని ఆరోపణ
ఈ సందర్భంగా క్రాంతి జ్యోతి పరిషత్ చైర్మన్ రమేశ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురుషులకు సరిపడా మహిళలు లేరని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని మంచి స్థానాల్లో ఉన్నప్పటికీ తమకు పెళ్లిళ్లు కావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడంతో లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోందని ఆరోపించారు.