జేపీ నడ్డా, బండి సంజయ్ లకు సిగ్గుందా?: కొప్పుల ఈశ్వర్
- బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ఈశ్వర్
- నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టిందని వ్యాఖ్య
- బీఆర్ఎస్ ను చూసి బీజేపీకి చెమటలు పడుతున్నాయని ఎద్దేవా
ఇక నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టిందని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ఆషామాషీగా పుట్టిన పార్టీ కాదని, ఆ పార్టీ అవసరం దేశానికి ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ను చూసి బీజేపీకి చెమటలు పడుతున్నాయని అన్నారు. కరీంనగ్ సభలో అన్నీ అబద్ధాలు చెప్పిన జేపీ నడ్డా, బండి సంజయ్ కు అసలు సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు.