Palvancha: పాల్వంచలో స్వల్ప భూకంపం... పరుగులు తీసిన ప్రజలు

  • మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రకంపనలు
  • ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయిన వైనం
  • శబ్దాలు కూడా వచ్చాయన్న స్థానికులు
  • రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రత నమోదు
Tremors in Palvancha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి స్వల్పంగా  కంపించడంతో పాటు శబ్దాలు కూడా రావడంతో ప్రజలు ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలకు ఇంట్లోని వస్తువులు కూడా కిందపడిపోయినట్టు స్థానికులు వెల్లడించారు. 

ఈ మధ్యాహ్నం 2.13 గంటల సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో పాల్వంచలో భయాందోళనకర పరిస్థితి నెలకొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More Telugu News