భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు!
- విజయవాడ, శ్రీకాకుళం రోడ్, వరంగల్, బరంపురం నుంచి ప్రత్యేక రైళ్లు
- నేటి నుంచే అందుబాటులోకి..
- 20వ తేదీ వరకు ప్రతి రోజూ ప్రత్యేక రైళ్లు
బరంపురం-విజయవాడ రైలు (07150) 17న మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-బరంపురం మధ్య నడిచే రైలు (07151) 15-20 తేదీల మధ్య ప్రతి రోజు విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఉదయం 11.15కు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (07152 ) బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.