Vijayawada: భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు!

  • విజయవాడ, శ్రీకాకుళం రోడ్, వరంగల్, బరంపురం నుంచి ప్రత్యేక రైళ్లు
  • నేటి నుంచే అందుబాటులోకి..
  • 20వ తేదీ వరకు ప్రతి రోజూ ప్రత్యేక రైళ్లు
Railway Announce Special Trains For Vijayawada Bhavani Devotees

బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఇది శుభవార్తే. భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.  నేటి నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం రోడ్-వరంగల్ ప్రత్యేక రైలు (07148) నేటి మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయలుదేరి రేపు ఉదయం ఆరు గంటలకు వరంగల్ చేరుకుంటుంది. అలాగే, వరంగల్-బరంపురం ప్రత్యేక రైలు (07149) రేపు సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది.

బరంపురం-విజయవాడ రైలు (07150) 17న మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-బరంపురం మధ్య నడిచే రైలు (07151) 15-20 తేదీల మధ్య ప్రతి రోజు విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఉదయం 11.15కు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (07152 ) బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

More Telugu News