పుజారా, అయ్యర్ అర్ధ శతకాలు.. గాడిలోపడ్డ భారత ఇన్నింగ్స్
- 200 దాటిన భారత స్కోరు
- మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగిన పంత్
- నిరాశ పరిచిన కోహ్లీ, గిల్, రాహుల్
దాంతో, నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో పుజారాకు శ్రేయస్ అయ్యర్ తోడయ్యాడు. పుజారా తనదైన శైలిలో టెస్టు ఇన్నింగ్స్ ఆడుతుండగా.. శ్రేయస్ దూకుడు చూపెడుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకోగా.. భారత్ స్కోరు చివరి సెషన్ ఆరంభంలోనే 200 మార్కు దాటింది. ప్రస్తుతం 66 ఓవర్లకు 209/4 తో నిలిచింది. పుజారా 64, శ్రేయస్ 54 పరుగులతో అజేయంగా నిలిచారు.