Balakrishna: 'వీరసింహా రెడ్డి' నుంచి సెకండ్ సింగిల్ రెడీ!

  • 'వీరసింహా రెడ్డి'గా బాలకృష్ణ 
  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
  • అందాల సందడి చేయనున్న శ్రుతి హాసన్
  • ఈ నెల 15న సెకండ్ సింగిల్ రిలీజ్ 
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల
Veera Simha Reddy Movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది. మైత్రీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఫస్టు లుక్ తోనే ఆసక్తిని కలిగించి .. అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ కి రెడీ చేస్తోంది. తమన్ స్వరపరిచిన పాటల్లో నుంచి 'సుగుణ సుందరి' అంటూ సాగే పాటను, ఈ నెల 15వ తేదీన ఉదయం 9:42 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు.

పవర్ఫుల్ పాత్రలో .. డిఫరెంట్ లుక్ తో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మిగతా ముఖ్యమైన పాత్రలలో వరలక్ష్మి శరత్ కుమార్ .. దునియా విజయ్ .. రవిశంకర్ .. లాల్ కనిపించనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News