నిజామాబాద్ పట్టణంలో రాత్రి పేలుడు కలకలం.. కారణం ఇదే!
- పట్టణంలోని బడా బజార్ ప్రాంతంలో శనివారం రాత్రి భారీ శబ్దంతో పేలుడు
- మంటలు వ్యాపించి దెబ్బతిన్న మూడు దుకాణాలు
- రసాయనాలు ఉన్న డబ్బాను కదిలించడంతో పేలిందని ప్రాధమిక నిర్ధారణ
మరోవైపు పేలుడు కారణంగా ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దాంతో, ఓ వైన్ షాపు సహా మూడు దుకాణాలు దెబ్బతిన్నాయి. ఫైర్ ఇంజన్లు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పేలుడు గురించి తమకు సమాచారం అందిందని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రసాయనాల పెట్టెను కదిలించినప్పుడు పేలుడు జరిగిందని ఈ సంఘటనలో గాయపడిన వారు తెలిపారని చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసుల బృందం చేరుకొని సాక్ష్యాలను సేకరించింది.