సజ్జల వ్యాఖ్యల వెనుక బీజేపీ కుట్ర ఉంది: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా
- రాష్ట్ర విభజనను వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతున్నారని పల్లా మండిపాటు
- సజ్జల వ్యాఖ్యలను ఆషామాషీగా భావించడం లేదని వ్యాఖ్య
- తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శ
ఇప్పటికే వైఎస్ షర్మిల, కేఏ పాల్ వంటి బాణాలను బీజేపీ వదిలిందని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని... కేసీఆర్ నాయకత్వంలో దూసుకుపోతోందని పల్లా అన్నారు. దేశంలో మరే రాష్ట్రం సాధించలేని అభివృద్ధిని సాధించామని చెప్పారు. దేశాభివృద్ధి కోసం పని చేసే అవకాశం బీఆర్ఎస్ ద్వారా దక్కుతుందని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పును తీసుకొచ్చే దిశగా బీఆర్ఎస్ పని చేస్తుందని చెప్పారు.