'పంచతంత్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!
- విభిన్నమైన కథా చిత్రంగా 'పంచతంత్రం'
- ఈ నెల 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రత్యేక అతిథిగా హరీశ్ శంకర్
- ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
సృజన్ - అఖిలేశ్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంటుకి డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. స్పెషల్ గెస్టుగా హరీశ్ శంకర్ రానున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
బ్రహ్మానందం .. స్వాతి రెడ్డి .. దివ్య శ్రీపాద .. శివాత్మిక .. రాహుల్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి మరి.