ఆలయాల్లో సెల్ఫోన్లు నిషేధించాల్సిందే: మద్రాస్ హైకోర్టు
- సెల్ఫోన్లు నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ పూజారి
- మొబైల్ ఫోన్ల కారణంగా ఆలయ భద్రతకు, విలువైన వస్తువులకు ప్రమాదం పొంచి వుందని ఆందోళన
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ సెల్ఫోన్లను నిషేధించాలని కోర్టు ఆదేశం
ఆలయానికి వచ్చిన భక్తులు తమ సెల్ఫోన్లలో దేవతామూర్తుల ఫొటోలు తీస్తున్నారని, వీడియోలు చిత్రీకరిస్తున్నారని, పూజలను కూడా రికార్డు చేస్తున్నారని సీతారామన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది పురాతన ఆలయమని, ఇక్కడ ఆగమ నియమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆలయంలో సెల్ఫోన్లు ఉపయోగించడం వల్ల ఆలయ భద్రతకు, విలువైన వస్తువులకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళా భక్తులను రహస్యంగా తమ ఫోన్లలో చిత్రీకరించే అవకాశం ఉందని అన్నారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. ఆలయ పవిత్రతను కాపాడేలా అన్ని ఆలయాల్లోనూ సెల్ఫోన్ల వాడకంపై నిషేధం విధించాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది.