ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ కు ఊరట
- లోకేశ్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు
- 2021 జూన్ లో అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కేసు నమోదు
- లోకేశ్ పై కేసును కొట్టేసిన హైకోర్టు
ఈ కేసు విచారణకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో విజయవాడ మొదటి అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టి వేయాలని తన పిటిషన్ లో కోరారు. లోకేశ్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.